కృష్ణ బలిజ సంఘం ఉగాది శుభాకాంక్షలు

16, మార్చి 2010, మంగళవారం

కృష్ణ బలిజ సంఘం ఉగాది శుభాకాంక్షలు
మరియు గ్రేటర్ హైదరాబాద్ కృష్ణ బలిజ సంఘం నూతన కార్యాలయం ప్రారంభం ఈ రోజు జరగడం ఎంతో శుభ పరిణామం
ఎన్నో సంవత్సరాలుగా ఆంధ్ర ప్రదేశ్ క్రిషన్ బలిజ సంఘం ఉన్నప్పటికీ సరియన శాశ్వతమైన కార్యాలయం లేక పోవడం
శోచనీయం.
జనవరి ౩ వ తారీఖున ఏర్పాటు అయిన గ్రేటర్ హైదరాబాద్ కృష్ణ బలిజ సంఘం
నేడు ఒక కార్యాలయం ఏర్పాటు చేసుకోవడం సంఘియులుకు శుభసూచకం
ఈ కార్యాలయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు దగ్గరగా ఉండడం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంఘియులకు చాల అనుకూలంగా ఉంటుంది
ప్రతి సంఘియుడు హైదరాబాద్ వచ్చారంటే ఈ కార్యాలయాని సందర్శించే విధంగా సికిందరాబాద్ స్టేషన్ కు అతి సమీపంలో లో ఉండడం గమనించ దగ్గ విషయం
కార్యాలయం ప్రారంభం తెలుగు వారు జరుపుకొనే ఉగాది పర్వదినాన ప్రారంబించారు
ఈ కార్యాలయాని కి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కావేటి ఎలమంద గారు , రాష్ట్ర కృష్ణ బలిజ సంఘం కార్యదర్శి మరియు
గ్రేటర్ హైదరాబాద్ కృష్ణ బలిజ సంఘం గౌరవ అధ్యక్రులు, అధ్యక్షులు మరియు కార్యదర్శులు
కృష్ణ బలిజ ఎడ్యుకేషన్ ట్రస్ట్ నిర్వాహుకులు మరియు ఇతర సంఘ నాయకులూ విచ్చేసినారు.
రాష్ట్ర బి సి సంఘ నాయకులూ శ్రీ ఆర్ క్రిష్ణయ్య గారిని ఆహ్వానిచినప్పటికి వారు ఢిల్లీ నుంచి ఇంకా రాష్ట్రానికి రాలేకపోవడం జరగింది
ఈ కార్యాలయం ప్రారంబ కార్యక్రమంలో పాల్గొని పలువురు సంఘ ప్రముఖులు ప్రసంగించారు.
కార్యాలయం చిరునామా :
ఇంటి నం: 9-3-102,
రేజ్ మెంటల్ బజారు మొదటి విధి,
మహేష్ లాడ్జి దగ్గర,
రైతఫిల్ బస్ స్టాండ్ ఎదురు సంధులో
సికిందరాబాద్ -500 025
H.No. 9-3-102,
Rezmental bazar lane 1
near Mahesh Lodge
Rythphil bus stand
Secend

నివేదనలు

23, ఫిబ్రవరి 2010, మంగళవారం

బిసి-డి గ్రూపులో కృష్ణ బలిజ (దాసరి, బుక్క) అని కులంగా ఉన్నారు. ఎంతోకాలం నుంచి సంచార జాతిగా ఉన్న కులం కనుక తమను గ్రూప్‌-డి నుంచి `ఎ'లోకి మార్చాలని కోరుతు న్నారు.

లేబుళ్లు:

రుపాంతరం చెందుట

అయితే దినిలొ కొన్ని తేగలు బట్టల వ్యాపారం చేస్తూ అబివృద్ది చేందతున్నారు. కృష్ణ బలిజ కులం వారు నేడు హైదిరాబాదు, విజయవాడ, గుంటూరు, చిరాల, బపట్ల, అనంతపురం, ఎలురు,కొయ్యల గూడేం, రాజమండ్రి, విశాఖపట్నం, ఒంగొలు, నెల్లురు, ఛెన్నై, బెంగుళురు, మొధలగు పట్టణలలొ స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు.

నివేదనలు కొరకు చూడండి

లేబుళ్లు:

సామాజిక జీవితం మరియు వృత్తి

సామాజిక జీవితం మరియు వృత్తి

కుంకుమ, గంధాన్ని తయారు చేస్తారు.కుంకుమ తయారుచేయడానికి పడమటి కనుమలు, ఆరావళి పర్వతాలలో రాళ్లు సేకరించి పొడిచేసి వజ్రకాయం పట్టి సుగంధ ద్రవ్యాలు కలుపుతారు. వసంతోత్సావాలలో చల్లుకోవటానికి పచ్చ, పసుపు, ఎరుపు, కాషాయం వంటి రంగులను కూడా వీరే తయారు చేస్తారు. వట్టివేళ్లు, ఉత్తరేణి వేళ్లు, గంధం పొడిలో కలిపి తయారు చేస్తారు.కుంకుమతోపాటు వసంతోత్సవాలలో వాడే బుక్కా నే కాదు, గులాబ్, పన్నీరు వంటి వాటిని కూడా తయారు చేస్తారు. కుంకుమ అమ్మే వారిని కుంకపోళ్లని, బుక్కా అమ్మేవారిని బాక్కా వారని పిలుస్తుండేవారు. స్త్రీలు ఉపయోగించే అలంకరణ సామ గ్రి కుంకుమ, కాటుక, గాజులు, పూసలు, పిన్నులు, సవరాలు ఇతర సౌందర్యసామగ్రి కూడా అమ్ముతారు. ఫ్యాన్సీ షాపులు వీరి వృత్తిని దెబ్బతీశాయి. వీరు గంపల్లో పెట్టుకుని అమ్మే సామాను ఫ్యాన్సీ షాపుల్లోని అద్దాల షో కేసుల్లో అందంగా, ఆకర్షణీయంగా కనిపించటం తో సామాన్య ప్రజలు అటువైపు మొగ్గు చూపారు. వీరు మారుమూల పల్లెలు, గ్రామాలు ఎంచుకున్నారు. ఫుట్‌ పాత్‌లపైనా, తోపుడు బండ్లమీద, సైకిళ్ల పైన ఊరూరా తిరిగి వ్యాపారం చేస్తుంటారు. పాత గుడ్డలు, అల్యూమినియం సామగ్రి, మహిళలకు కావాల్సిన వస్తువులు అమ్ముకుని జీవిస్తున్నారు. పూర్వం సంచారం చేస్తూ జీవనం సాగించిన వీరు స్వాతంత్య్రానంతరం స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. అయినా ఊరూరా తిరిగి సామగ్రిని అమ్ముకునే జీవన విధానానికి స్వస్తిపలకలేదు.

రుపాంతరం చెందుట

లేబుళ్లు: